Thursday 11 October 2018

రాబోయే పుష్కర స్నానం భీమా నది కాదు తామ్రపర్ణి పుష్కరాలు 12 October నుండి 23 2018 వరుకు

రాబోయే పుష్కర స్నానం భీమా నది కాదు తామ్రపర్ణి పుష్కరాలు 12 October  నుండి 23 2018 వరుకు.

'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం. ఈ నదిలోని ఇసుక ... నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు. విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ... అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత.

రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. కైలాస పర్వతంపై శివపార్వతుల కల్యాణం జరిగిన తరువాత, అగస్త్యుడు దక్షిణ భారత దేశ యాత్రలకు బయలుదేరాడు. ఆ సమయంలో తనకి లభించిన 'పద్మమాల'కు స్త్రీ రూపాన్ని ప్రసాదించి, 'తామ్రపర్ణి' పేరుతో జీవనదిగా ప్రవహిస్తూ జీవుల దాహార్తిని తీర్చమని చెప్పాడు. దాంతో తామ్రపర్ణి అగస్త్యుడిని అనుసరిస్తూ వుండగా, ఆయన ఆ నదీ తీరం వెంట అనేక పుణ్య తీర్థాలను స్థాపిస్తూ వెళ్లాడు. అలా ఆయన ఇటు దేవతలు ... అటు మానవులు స్నానమాచరించదగిన 118 పుణ్య తీర్థాలను స్థాపించినట్టు స్థల పురాణం చెబుతోంది.

తామ్రపర్ణి అనేక ప్రవాహాలను తనలో కలుపుకుంటూ అంబ సముద్రానికి కొంత దూరంలోని కొండలపై నుంచి దూకుతుంది. ఈ జలధారలతో ఏర్పడినదే 'పాపనాశ తీర్థం'. ఈ జలాలతో స్నానం చేసిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదీ తీరంలో కొలువుదీరిన శివ కేశవ క్షేత్రాలను విశేష సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ నది పవిత్రతను గురించి ... దీనిలో స్నానమాడటం వలన కలిగే పుణ్య ఫలాల గురించిన ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది.
...

తామ్రపర్ణి నదికి పుష్కరాలైతే భీమా నదికి అని చెప్పి మోసం చేస్తున్న వ్యాపారులు
ఏ నదికి ఈ సారి పుష్కరాలు?
------------------////----------
పుష్కరమంటే 12ఏళ్ళు.ప్రతి 12ఏళ్ళకు ఒక నదికి పుష్కరం వస్తుంది. మనకు 12రాశులున్నాయి.ఆయా రాశులలో బృహస్పతి సంచరించే కాలంలో ఒక్కో నదికి పుష్కరాన్ని బ్రహ్మ దేవుడు అనుగ్రహించాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన తొలి 12రోజులు ఒక్కో నదికి పుష్కరమొస్తుంది.ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యప్రదం అని నమ్మకం.
ఈ సంవత్సరం భీమా నదికి పుష్కరమని పంచాంగాలలో వ్రాశారు. దీన్ని బట్టి వివిధ ట్రావెల్స్ సంస్థలు ప్రోపగాండా మొదలెట్టేశారు.అప్పుడే రైల్వే టిక్కెట్లన్నీ బ్లాక్ చేసేసారు. భీమానది మహారాష్ట్రలోని భీమశంకర్ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ వరకు వచ్చి కృష్ణలో కలసిపోతుంది.ఈ నదికే పుష్కరమని నిర్ణయించేసి పైన చెప్పినట్లు టిక్కెట్లు బుక్ చేసేసారు.
కానీ భీమానది కి అసలు పుష్కరమే లేదు.పుష్కర నిర్ణయం మూలశ్లోకం చూడండి.

"శ్లొ//మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా
వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ
మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా
మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా
పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా....."

ఇదీ మూల శ్లోకం.
దీన్ని బట్టి చూస్తే ఈ జాబితాలో"భీమానది"లేదు.తామ్రపర్ణి మాత్రమే ఉంది.ఈ తామ్రపర్ణి నది ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం చేత దీనికి "భీమరథి"అనే పేరు ఉంది.అంతే కానీ ఇది భీమానది మాత్రం కాదు.

ఈ తామ్రపర్ణి నది తమిళనాడు లోని తిరునల్వేలి ,తూత్తుకూడి జిల్లాల్లో ప్రవహిస్తుంది. శాస్త్రప్రకారం 'బాణతీర్థం'లో పుష్కర స్నానం చేయాలి.బాణతీర్థం దగ్గరలోని రైల్వేస్టేషన్'అంబాసముద్రం'.

కాబట్టి దయచేసి అందరూ గమనించండి.మనం పుష్కర స్నానం చేయవలసింది తామ్రపర్ణి నదిలో!!!!
అంతే కానీ 'భీమానది'లో కాదు.

భీమా నది పుష్కరాలు 12-10-2018 : BHIMA NADHI PUSHKARAMULU

 12-10-2018  నుండి  23-10-2018 భీమా నది పుష్కరాలు: ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఏవిధముగా ఉండును.

 

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులుభావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి

భీమానది పశ్చిమ కనుమల్లోని భీమశంకర్ ఆలయం వద్ద పుట్టింది. ఇది కర్నాటక- తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిలో కలుస్తుంది. భీమానదితో పాటు తమిళనాడులోని తామ్రపర్ణి నదికి కూడా పుష్కరాలు వస్తాయి. 

ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఏవిధముగా ఉండును: 


తేది : 11.10.2018 అనగా గురువారం రా. 08.04 ని.ల నుండి గురువు గ్రహం (బ్రహస్పతి గ్రహం) తులా రాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశము అవుతున్నందునా ఆయా రాశుల వారికి దానిప్రభావం వుంటుంది.
దీంతో ఈ రాశుల వారికి అనుకూలంగా వుంటుంది.
1) వృషభ రాశి కి 7 లో శుభం
2) కర్ణాటక రాశి కి 5 లో
3) తులా రాశి కి 2 లో
4) మకర రాశి కి 11 లో ( Best) ఫలితాలు కలుగుతాయ్.
ఈ క్రింద రాశుల వారికి అనుకూలమై వుండదు.
1) మేషం 8 వ స్థానం లో
2) మిథునం 6 లో
3) సింహ రాశి కి 4లో
4) కన్య రాశి కి 3 లో
5) వృశ్శిక రాశి కి 1 లో
6) ధనస్సు రాశి కి 12 లో
7) కుంభ రాశి కి 10 లో
గురు గ్రహం అనుకూలంగా లేని వారు గురు ఙపం, దానం చేసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. శుభమస్తు

Monday 8 October 2018

వివాహ పొంతన పరిశీలన -marriage match kundili checking process

వివాహ పొంతన సమగ్ర పరిశీలన : 

మనవ జీవన విధానములో వివాహం చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటె మనిషి తన జీవితం ఏ ఎదుగుదలకు బాగస్వామి పాత్ర ఎంతగానో ఉంటుంది ,వంశం వృద్ది ,సమాజం మేరుగుపడుడుతకు వివాహ జీవితం ఎంతగానో ప్రభావం పడుతుంది, వివాహ జీవితం లో ముఖ్యముగా జాతకరిత్య పరిశీలన చేయునప్పుడు స్త్రీ పురుషులలో గమనించవలిసినవి వధువు ,వరుని వ్యక్తీ గత జతకంతో పాటు వాళ్ళ ఇద్దరి జాతక చక్రం లో ముఖ్యముగా పరిశీలన చెయ్యవలిసి ఉండును,అవి ఏమనగా  1. మానసిక  స్వభావములు 2. ఆరోగ్య స్ధితి గతులు 3. సంతన స్థానములు ,    ఇవి సాయన ,నిరాయన  జాతక విదివిధానములో ఏవిదముగా పరిశీన చేయుదరో ఇప్పుడు తెలుసుకుందాం 

సాయన విధానం లో  జన్మ జాతక చక్రం వధువు వరుడిని తీసుకోని ఈ క్రింద విషయములను పరిశిలిస్తారు 

> అబ్బాయి జాతకం లో చంద్రుడు బాగుండాలి  --> అమ్మాయి జాతకం లో రవి బాగుండాలి , 
> అబ్బాయి జాతకం లో శుక్రుడు  బాగుండాలి  --> అమ్మాయి జాతకం లో కుజుడు  బాగుండాలి ,
> అబ్బాయి జాతకం లో బుధుడు  బాగుండాలి  --> అమ్మాయి జాతకం లో గురుడిని  బాగుండాలి  ,
పై గ్రహ పొంతనలో అబ్బాయి కి అమ్మాయికి ఇద్దరిలో ఏ ఒక్కరికి గ్రహ స్థితి బాగోపోయిన ఆ పాయింట్ తీసుకోము ..ఇలా ముడితో కనీసం రెండు అయిన బాగుండాలి. 
> అబ్బాయి జాతకం లో  లగ్నం లేదా సప్తమం లో  యురేనాస్ ,నెప్ట్యూన్ ,ప్లూటో ,నోడ్( రాహువు ),ఏంటి -నోడ్ (కేతువు ) ఒకే  డిగ్రీ లు   అమ్మాయి > > > జాతక చక్రం లో లగ్నం లేదా సప్తమం లో అదే డిగ్రీ లలో ఉండరాదు.
> వధువు లేక వరుడు ఉంటే ఇద్దరికీ కుజ దోషం వుండాలి లేకపోతె ఎవరికి ఉండరాదు, ఒక్కరికి కుజదోషం వుంది మరొకరికి కుజ దోషం లేకపోతె వాళ్ళ ఇద్దరికీ వివాహం చేయుట సరి కాదు,
> అమ్మాయి కానీ అబ్బాయి కానీ శని-చంద్రులు ,లేక శని-రవి ల దృష్టులు  సమసప్తకము(0-30 డిగ్రీ ) లేక వెతిరేక దృష్టి (180 డిగ్రీ ) లేదా కేంద్ర దృష్టి (90 డిగ్రీ )వచినప్పుడు  వివాహ పొంతన పరిగినిలోకి తీసుకోరు.

జాతక చక్రం బట్టి  ఒక్క అబ్బాయి కి ఒక అమ్మాయితో వివాహం అవ్వుతాది అన్నిపరిశీలించుట ఎలా :
ప్రేమ వివాహం అనుకూలత తెలుసుకొనుట ఎలా : 
అమ్మాయి లేక అబ్బాయి జన్మ చక్రం లో లగ్నం,  అబ్బాయి లేక  అమ్మాయి  సప్తమ,తో సంబంధం వున్నా లేక ,అమ్మాయి లేక అబ్బాయి జన్మ చక్రం లో సప్తమం , అమ్మాయి లేక అబ్బాయి   లగ్నం ,తో సంబంధం వున్నా వాళ్ళ ఇద్దరికీ వివాహ గరుగును అన్ని చెప్పవచ్చును,అలాగే అమ్మాయి లేదా అబ్బాయి గురు,శుక్రులు వున్నా భావం కానీ కారకత్వము కానీ అబ్బాయి లేదా అమ్మాయి పంచమ వివాహ స్థానములను చూస్తున్న వాళ్ళ ఇద్దరికీ వివాహం జరిగే అవకాసం బలముగా వుండుని .ఈ విషయములు  ప్రేమ వివాహములు నిర్దారణలో బాగా ఉపయోగపడును.  
   
నిరయన విధానములో వివాహ పొంతన విధి విధానము : 
చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని,రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని ,లగ్నం శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది.
ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల,లగ్నాధిపతుల,రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన,మానసికమైన ఏకీకృత ఆలోచనా విధానం,శారీరక విషయాలలో లోపాలు లేకుండటం మొదలైన అంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతారు.
ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది.బాల్యవివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యకరమైన ఆనందకరమైన విధానమే ఈ మేలాపలకం.ఈ మేలాపలకం సరిగా ఉంటే వ్యక్తుల శరీర మానసిక ఆత్మిక ధోరణులలో ఐక్యత ఉండి దాదాపుగా ఇద్దరి ఆలోచనా ప్రవృత్తుల్లో ఆనందదాయకమైన ఫలితాలు ఏర్పడతాయి.లేకుంటే బలవంతంగా భావాలను,శరీరాలను పంచుకోవాల్సి రావటం వల్ల అక్రమ విధానాలకు,ఇబ్బందులకు వ్యక్తులు పాల్పడుతుంటారు.ప్రాశ్చాత్యులు కూడా ప్రస్తుత కాలంలో వివాహాల విషయంలో మేలాపకాదులను గమనిస్తున్నారంటే వారి విధానాల నుండి మన వైజ్ఞానిక మేలాపాక విధానం,సంప్రదాయ ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు వారు చూసే చూపును మనం అర్ధం చేసుకోవచ్చును.
చాలా మంది పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.
వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం),సప్తమ స్ధానం (దాంపత్య జీవితం),అష్టమ స్ధానం(వైదవ్యం),దశ ,అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.
వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం,కానీ సప్తమ,పంచమ,అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు.ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
కర్కాటకం,వృశ్చికం,మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం,సింహం,దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున,తుల,కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.
వృషభ,కన్య,మకర రాశులు శూద్ర వర్ణం.
వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం.వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం.వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.
2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి – వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము , మకర రాశికి – మేషం , కుంభం కుంభరాశికి – మేషము , మీనమునకు – మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున,కన్య,తుల నర రాసులు.వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే.సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.
౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.
4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త-ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తిక-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త-పులి
ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు
పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస , సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు.ఒకే యోని అయితే సంపద,భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం,రాశి కూటం,వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.
5 గ్రహకూటమి :
సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు , కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం,సమమైత్రి మద్యమం,పరస్పర సమత్వం కనిష్ఠం,పరస్పర శతృత్వం మృత్యుపదం,శతృత్వం కలహాప్రదం.
6 గణ కూటమి :-
స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.
దేవగణ నక్షత్రాలు:-అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,హస్త,స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.
మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు.భాదించటం,వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.
రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక,ఆశ్లేష,మఖ,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,ధనిష్ట,శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు.అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు.కఠినంగా మాట్లాడుతారు.మిక్కిలి స్వార్ధపరులు.
వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం ,ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు,5-9 అయితే సంతాన హాని,2-12 అయితే నిర్ధనత్వం.
ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.
మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.
శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.
అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.
శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.
అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-మిధునం,మీనం-కర్కాటకం.
ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.
8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటములో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.
శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.
1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.వదూవరులిద్దరి నక్షత్రాలు ఉత్తర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.
2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ,అనురాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.
3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాడ,రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.
జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.
మహర్షి వశిష్టు (Maharishi Vashisht)ని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.
నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nari also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Naridosh also effect Mind of their Child and Health of their Child).
ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Naridosha will not affect you in this Conditions)
1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.
2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.
3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.
తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.

దేవినవరాత్రి పరిపూర్ణ పూజా విధానము

దేవినవరాత్రి పూజా విధానము
దేవీ నవరాత్రులు ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే. ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. మహిషాశురుని మర్దించి శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి అవతారాలని ప్రతిష్టించి పూజలు జరుపుకుంటారు. కొంతమంది తమ ఇంట్లో ఆహవనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిని అగ్ని అను హోమాలు రోజూ జరుపుకుంటారు. ఇవే కాకుండా అదిత్య హొమము మహాసూర్య మంత్రాలను పఠిస్తూ జరుపుతారు. ఈ హొమములు చేయుట వలన ఇంటి ఆవరణం మహా శక్తి మయమై, ఇంటి వాతావరణం ఎల్లప్పుడు స్వచ్చంగా వుండును.
Image result for విజయ దశమి గురించి


1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దసమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదసమి ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి.

పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి.L
గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.
పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను. ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అజ్ఞాతవాసము చేసినారు. అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదశమి నాడు వారి అజ్ఞాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున శమి వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయ బడుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనము లు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను. అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేర ను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి,
అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి: మధ్యే అపరాజితాయై నమః ఇత్యపరాజితామావాహ్య తద్దక్షిణే క్రియా శక్తయేనమః ఇతి జయాం నామతః ఉమాయైనమః ఇతి విజయా నామ అపరాజితా యైనమః జయాయైనమః విజయాయైనమః అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము. కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు.

Friday 5 October 2018

పోలాల అమావాస్య వ్రతం తెలుగు మరియు english


పోలాల అమావాస్య వ్రతం తెలుగు మరియు english 
 ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
Image result for పొలాల అమావాస్య కథ
వ్రతములు కేవలం స్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకంటే..,స్త్రీలకు, బ్రాహ్మణేతర స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. అవి ప్రస్తుతం మనకు అప్రస్తుతం.  స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్ధేశించబడినదైతే.., ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.

వ్రత కథ
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన  బిడ్డను తన  గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో  స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.
ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.
Image result for పొలాల అమావాస్య కథ

వ్రత విధానం
ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్క లోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ  ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

Polala amavasya- is an important vrathamdedicated to Goddess Poleramma, observed on Sravana amavasya (no moon day). Poleramma is the local deity. This vratham is mainly observed in Andhra Pradesh and some parts of Karnataka. North Indians celebrate as Pithori amavasya and Maharashtrians as Pola.
Goddess Poleramma is known as the protector of children. Every year, offering prayers to Poleramma coincides on the amavasya day and hence the vratham is called Polala amavasya. Symbolically Goddess is worshiped in the form of  “kanda mokka” (suran or yam shrub) or “kanda dumpa”(suran or yam bulb). Women perform puja andraksha thoranam (sacred thread) is also worshipped during the puja. According to vrata texts, by performing this vrata, one can safe guard their children from the clutches of death. Women tie the sacred thread to her children after reading the story about a mother who prayed Poleramma to help bring back her dead young children. For the welfare of the male children fried sweet balls of chana dal and jaggery are made, for the welfare of female children urad dal vadas are made and offered to Goddess Poleramma.

Thursday 4 October 2018

పాకిస్తాన్ లో అతి పురాతన శివాలయం

హిందు దేవాలయములు  వాటి విశిష్టత   పాకిస్తాన్ లో అతిపురాతన శివాలయం : 
ఒకే చోట 7 ఆలయాలున్నాయి.వాటిలో శివాలయం ప్రధాన ఆకర్షణ.రామ మందిరం , హనుమాన్ గుడి వున్నాయి. ఆ ఆలయాలు క్రీ.శ.6వ శతాబ్ధం నుంచి 9వ శ. వరకు రూపుదిద్దుకొన్నాయి. ఆ ఆలయాలకు సమీపంలోనే బౌద్ధ స్తూపాల ఆనవాళ్లున్నాయి. సింధూ నాగరికత కాలం నాటి వస్తువులు కొన్ని ఆ ప్రాంతంలో దొరికాయి. కటాసరాజ ఆలయం పాకిస్తాన్లోని పంజాబురాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దేవాలయం. ఇది చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉoది. ఇది ఒక శివాలయం.
మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపారట. ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ,రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి.Image may contain: outdoor 
ఇక్కడ100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటాసక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాలయంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు.
ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు భారతదేశంనుండి విగ్రహాలను దిగుమతి చేసుకొంది.

Sunday 26 August 2018

గృహం లో ఎటువంటి వృక్షములు పెంచవలెను ,ఎటువంటి వృక్షములు పెంచాకోడదు

జ్యోతిష్య శాస్ర రిత్య గృహం లో ఎటువంటి వృక్షములు పెంచవలెను ,ఎటువంటి వృక్షములు పెంచాకోడదు ?
సంపదను పెంచే 5 మొక్కలు
మీ ఇంట్లో ఈ 5 రకాల మొక్కలను పెంచుకోవడం వలన సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మొదటిది అత్యంత శుభప్రదమైనది తులసి మొక్క. కృష్ణ తులసి, లక్ష్మి తులసి రెండు కలిపి మీ ఇంట్లో తూర్పు ముఖంగా ఉంచి పెంచితే మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మీరు చేసే పనులలో విజయం కలగడమే కాకుండా శుభ ఫలితాలు కలుగుతాయి.
రెండవది ఉసిరి చెట్టు. ఉసిరిని మొక్కగా అయినా పెంచవచ్చు లేదా వృక్షం లాగా అయినా పెంచవచ్చు. ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పురాణాలు చెప్తాయి. కార్తిక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఉసిరి చెట్టును పెంచడం వలన మీ ఇంట్లో చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి.
మూడవది మారేడు చెట్టు. దీనినే బిల్వ వృక్షం అని కూడా అంటారు. మారేడు చెట్టును ఆ సిరుల తల్లి యొక్క స్వరూపంగా మన పురాణ గ్రంధాలు చెబుతున్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడే మారేడు మొక్కను నాటడం వలన 7 జన్మల పాపం పోతుంది అని పండితులు చెప్తున్నారు. మారేడు చెట్టుకు ప్రతి శుక్రవారం 5 సార్లు ప్రదక్షిణ చేస్తే సంపాదకు ఎటువంటి లోటు ఉండదు. మారేడు ఆకును శుభ్రపరిచి దాని మీద తేనే వేసి ప్రతి శుక్రవారం తులసి చెట్టు దగ్గర ఉంచి నమస్కరిస్తే ధనానికి కొరత ఉండదు.
నాల్గవది అరటి చెట్టు. దీనిని మీ ఇంట్లో పెంచుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలకు లోటు ఉండదు. అరటి మొక్కను పెరట్లో గాని కుండీలో గాని పెంచుకోవచ్చు.
ఐదవది అలోవేరా లేదా కలబంద మొక్క. ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్క. అందరి ఇంట్లో తప్పకుండా ఈ మొక్క ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఈ మొక్క ఉంటుందో ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష, శాపాలు అన్ని తొలగిపోతాయి. కలబంద మొక్క యొక్క వేరు ప్రధాన ద్వారం యొక్క కుడి వైపు కట్టడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు.
కావున ఈ 5 మొక్కలను మీరు పెంచుకోవడం వలన మీరు ధనపరంగా  ఎటువంటి ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు.
దురదృష్టముని పెంచే వృక్షములు : 
సాధారణంగా ప్రకృతిలోని ప్రతి చెట్టు కూడా మానవ మనుగడకు ఎంతో పనిచేస్తుంది. “వృక్షో రక్షిత రక్షిత:” అని పెద్దలు చెప్పారు. అంటే చెట్లను మనం రక్షిస్తే మనలను చెట్లు కాపాడుతూ ఉంటాయి. చెట్ల నుండి ఔషధాలను, ఆహారాలను సంపాదిస్తారు. కాని ఒక చెట్టు మీ ఇంటి ముందు ఉండటం వలన చాలా అనర్ధాలు ఎదురవుతాయని పెద్దలు చెప్తున్నారు. ఆ చెట్టు ఏంటో, దాని వలన వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీ ఇంటి ముందు ప్రవేశ ద్వారం వద్ద ములగ చెట్టును ఎప్పటికి పెంచకండి. ములగ చెట్టు ఇంటికి ఎడమ భాగంలో గానీ మీరు ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే మీకు కనపడే స్థలంలో పెంచుకోవచ్చు. దీనిని మూఢనమ్మకం అని చాలా మంది భావిస్తారు. కాని దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. మరి ఆ ప్రభావం ఏంటో, ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మీలో చాలామంది ఇలా గమనించి ఉండవచ్చు. అదేంటంటే ఒకరు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మొదటి దశలో చాలా అభివృద్ధి చెంది తరువాత అకస్మాత్తుగా నష్టపోయి దివాళా తీస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగిందంటే వారు వారి ఇంటి ముందు తెలిసో తెలియక ములగ చెట్టును పెంచి ఉంటారు. అంతేకాదు దీని ప్రభావం భార్యాభర్తల మీద కూడా ఉంటుంది. పెళ్లి అయిన దంపతుల మధ్య సరైన అవగాహన లేకుండా అనుమాన జీవితం గడుపుతూ రోజు గొడవలు పడుతూ ఉంటారు. ఆనందంగా ఉండాల్సిన వారి జీవితం నరకంగా మారుతుంది. ఎవరి ఇంటి ముందు అయితే ఈ ములగ చెట్టు ఉండి లేచిన వెంటనే చూస్తూ ఉంటారో వారి ఇంట్లో వారికి ఎప్పుడు ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. చివరికి పిల్లలు కూడా అనారోగ్యపాలవుతారు. కుటుంబంలో మనస్పర్ధలు, గొడవలు ఇతర సమస్యలు మొదలవుతాయి. ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు అనుకున్న ఏ పనులు జరగవు. మీరు ఏ పని మీద బయటకు వెళ్ళిన మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. ములగ చెట్టు మీ ఇంటి ముందు ఉంటె ఇలాంటి అనర్ధాలే సంభవిస్తూ ఉంటాయి.
అందుకే ములగ చెట్టు ఇంటి ముందు ఉంటే ముప్పు అని ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు గాని ఇంటి లోపలి ప్రవేశించేటప్పుడు గాని ములగ చెట్టును చూడకూడదు అని చెప్తారు.ఎక్కడ కనపడని, అంతగా ఎవరు చూడని, తిరగని ప్రదేశంలో ఈ చెట్టుని పెంచుకోవచ్చు.ఒకవేళ మీ ఇంట్లో  ములగ చెట్టు ఉంటె దానిని ఆదివారం రోజున కొట్టి మీ ఇంటి వెనుక స్థలంలో పాతిపెట్టాలి. ఆ సందర్భంలో “ఓం వృక్షరాజా నమస్తేస్తుత్ అభిష్ట ఫలదాయనీ” అని చెప్పాలి. ఇలా చేయడం వలన ఎటువంటి దోషాలు ఉండవు.

Saturday 25 August 2018

అష్ట అశ్వయులు పొందుటకు నేడు ఆచరించవలిసిన హాయగ్రీవ పూజ విశిష్టత

అష్ట అశ్వయులు పొందుటకు నేడు ఆచరించవలిసిన హాయగ్రీవ పూజ విశిష్టత



హయగ్రీవ జయంతి విశిష్టత :
Image may contain: 2 people, people on stage and people standing

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా!

హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.

హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!

హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం-

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.

ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.

శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం : విద్య ,ఉద్యోగం,ప్రేమ ,పెళ్లి,సంతానం,అప్పుల బాధలు,విదేశీ యానాం ఇలా ఏ సమస్య అయిన శీఘ్రమే పరిష్కారం కొరకు మాకు సంప్రదించండి,మా (వాట్సాప్) నెంబర్ 9704840400

రక్షాబంధనం, జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, హయగ్రీవ పూజ లేక వరుణ పూజ

రక్షాబంధనం, జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, హయగ్రీవ పూజ లేక వరుణ పూజ
Image may contain: 2 people, people standing
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ''రాఖీ'' కట్టి, ''పది కాలాలపాటు చల్లగా ఉండాలని'' మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు.
జంధ్యాల పూర్ణిమ కూడా కనుక జంధ్యాలు ధరించే వారందరూ ఈ రోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తి చెయ్యడం రోజునుండే ప్రారంభిస్తారు.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
పై మంత్రాన్ని పఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.
బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.
ఈ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టే చెల్లాయిలే మనకు ఎక్కువగా కన్పిస్తుంటారు. తమ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కట్టడం సంప్రదాయం. రాకీలతోపాటు పూజాథాలీ (పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
అయితే సోదరులకే కాకుండా.. భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని, రాఖీకి చాలా పవిత్రత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
పూర్వం యజ్ఞ యాగాది క్రతువులు చేసే సమయంలోఆశ్రమ వాసులు ఆహూతులకు రక్షాబంధన సూత్రాలు కట్టేవారట. వారు దానిని ఆశ్రమ వాసుల్ని వారి క్రతువుల్ని కాపాడే భారం వహిస్తున్నట్టే ప్రమాణ సూత్రంగా భావించేవారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం దేవతల రాజైన శచీదేవి కట్టి రక్షాబంధనం వల్లే వృత్తాసురునితో సంగ్రామంలో విజయం సాధించాడని ద్వాపర యుగంలో ఓసారి శ్రీకృష్ణుని చేతికి గాయం కాగా ద్రౌపది తన చీరకొంగును కొద్దిగా చించి కట్టిన ఫలితంగా కౌరవులు ద్రౌపదికిని నిండు సభలో వస్త్రాపహరణం చేయు సమయంలో శ్రీకృష్ణుడు చీరలిచ్చి కాపాడిన విషయం మనకు తెలిసిందే. మహాలక్ష్మీ వైకుంఠుని కోసం బలి దగ్గరకు వెళ్లి చేతికి రక్షాబంధనం కట్టిందట. క్రీ.పూ. 326లో పురోషోత్తముడికి రొక్సానా కట్టిన రక్షా బంధనం వలనే అలెగ్జాండరు ప్రాణాలు రక్షింపబడ్డాయి అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది.
ఇలా రక్షాబంధనం గురించి మన పురాణాలో పెక్కు కథలున్నాయి. రక్షాబంధనం అనేది ఒక శక్తి వంతమైనది. మనం నిర్వహించే వ్రతాలకు నోములకు వేద మంత్రోచ్చారణలతో మన చేతికి రక్షా కంకణం కడతారు. వ్రతానికైనా, నోముకైన యజమానులు చేసే దీక్షకు రక్షణ అధికారం పొందటానికి రక్షాబంధనం చేస్తారు. మగవారు ఎడమ చేతికి స్ర్తిలు కుడిచేతికి ఈ రక్షబంధనం చేయడంసంప్రదాయంగా వస్తోంది.
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం : విద్య ,ఉద్యోగం,ప్రేమ ,పెళ్లి,సంతానం,అప్పుల బాధలు,విదేశీ యానాం ఇలా ఏ సమస్య అయిన శీఘ్రమే పరిష్కారం కొరకు మాకు సంప్రదించండి,మా (వాట్సాప్) నెంబర్ 9704840400.
పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టడమనేది మన ప్రాచీనులు ఏర్పాటు చేసిన ఓ విధానం. ఈ శ్రావణ పూర్ణిమ నాడు సోదరి ఓ పట్టు దారానికి జరీ పువ్వును గాని దంతం పువ్వుగాని కట్టి సోదరి తన క్షేమాన్ని కోరుకొమ్మని వేడుకొంటూ తన సోదరునికి చేతికి కడుతుంది. ఇది సోదరి సోదరుడికి కట్టే రక్ష. కనుక దీనిని రక్షాపూర్ణిమ అంటారు. లేక రాఖీ పూర్ణిమ అంటారు. ఈ రాఖీ పూర్ణిమ నాడు రక్షాబంధనాన్ని సోదరీమణుల చేత కట్టించుకొనే వారికి అపమృత్యువు ప్రాప్తించదని యమధర్మరాజు తన చెల్లెలైన యమునకు వరమిచ్చాడు. కనుక అన్నా చెళ్లెళ్ల మధ్యసంబంధం తోడు కలకాలం నిలువాలనే భావన రాఖీ కట్టించుకున్నవారిలో ఉండాలనేది మన సంప్రదాయం. ఈ శ్రావణ పూర్ణిమ నూలి పున్నమి అని నూలి పున్నమి అంటే యజ్ఞోపవీతం వేసుకొనే పున్నమి. నూల్ అంటే యజ్ఞోపవీతం. తమిళంలో దీనినిపూనుల్ అంటారు. ఆరోజు కొత్తగా వడుగైనవారు, మిగిలిన వారు జందెం మార్చి కొత్త జందెం ధరిస్తారు. యజ్ఞోపవీతాన్ని లేనిదే ఏ వ్యక్తీ కూడా శుభ అశుభ కార్యక్రమాలు వేటినీ నెరవేర్చకలేకపోతాడు. కనుక అతి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలని వేదం చెప్తోంది. వేదాధ్యయన ప్రారంభానికి ప్రతీకయైన ఉపాకర్మ కూడా ఈ శ్రావణ పూర్ణిమ నాడే చేస్తారు. అసలు ఈ శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ గా కూడా పిలుస్తారు.
రాఖీ పౌర్ణమిని ''బలేవా'' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ''ఏం కావాలమ్మా'' అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.
ద్రౌపదీ శ్రీకృష్ణుల సోదర ప్రేమ
మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.
శ్రీ మహావిష్ణువు విజయగాధా
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
భవిష్యోత్తర పురాణం
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది.
శ్రావణ పూర్ణిమ విశిష్టత
శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం.ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. దీన్నే కజరి పూర్ణిమ, నారియల్పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రుషి తర్పణం,రాఖీ పున్నమి.
శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు.
శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.
"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.

శ్రావణ శుద్ధ పౌర్ణిమ యజ్ఞోపవీతం మార్చుకోవలసిన పర్వదినం

శ్రావణ శుద్ధ పౌర్ణిమ యజ్ఞోపవీతం మార్చుకోవలసిన పర్వదినం:


మన భారతీయ సనాతన ఋషి సంప్రదాయం ప్రకారం

"యజ్ఞోపవీతం" విశిష్టత

మన సంస్మృతి ప్రకారం ఉపనయనం (ఒడుగు) జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు (పితృ సంస్కారాలతో సహా) అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు.

బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట,

క్షత్రియులకు గర్భధారణతో కలిపి 11 ఏట,

వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని వాడుకలో జందెం, జందియం, జంద్యం అని కూడా అంటారు.

యజ్ఞోపవీతం బ్రాహ్మణకన్య చేత భమిడి ప్రత్తితో వడక బడి బ్రాహ్మణుడి చేత మెలికలు వేయబడుతుంది.

జంద్యం యొక్క ప్రతి విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

జంద్యం పొడవు నాలుగు వ్రేళ్ళ వెడల్పుకి 24 రెట్లు అంటే సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది (ఆరు అడుగులు).

నాలుగు వ్రేళ్ళు మనిషి యొక్క జాగరణ, స్వప్న, నిస్వపన, బ్రాహ్మ (తురీయ) స్థితులు అనే నాలుగు ఆత్మ స్థితులను తెలియజేస్తాయి.

ప్రతి జంద్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి.

ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి.

ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది.

మామూలు సమయములోను, శుభ కార్యాలలోను యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్లు (సవ్యంగా) వేసుకుంటారు.

అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్లు (ప్రాచీనావీతిగా) వేసుకుంటారు.

మూత్ర, మల విసర్జన సమయాలలో మెడలో దండ లేదా తావళం (నివీతం) లాగా ఉండేటట్లు వేసుకుంటారు.

సంవత్సరానికి ఒక సారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు.

అందుకే ఆ రోజుకు జంద్యాల పూర్ణిమ అని పేరుకూడా వచ్చింది.

పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు.

“యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః”

ఈ విధంగా జపిస్తూ క్రొత్త యజ్ఞోపవీతం (జంద్యం) వేసుకోవాలి.

ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.