Tuesday 12 December 2017

ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి: శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము:

ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి: శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము



Image result for ఏకాదశి నాడు
శాస్త్రము (పురాణము): మార్గశిర మాసం శుక్ల పక్షం లో వచ్చే మొదటి ఏకాదశి ని "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువు లోని స్త్రీ తేజం 'ముర' అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది. ఆ స్త్రీ మూర్తికి  విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు. మురని హరించడం వలన శ్రీ హరి 'మురహర' లేదా 'మురహరి' లేదా 'మురారి' అయినాడు. ఈ ఏకాదశి నాడు విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం ద్వారా ఆలయం లో ప్రవేశించి దైవ దర్శనం చేసుకున్న వారు మోక్షాన్ని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజును 'మోక్షద ఏకాదశి' అని కూడా అంటారు.  అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం.  అయితే ఈ ఎకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్రనామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.
శాస్త్ర విజ్ఞానము: అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు. ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది.  అయితే చాల మంది గమనించే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది. ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు (ఉదా. రక్తము), మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమ క్రమంగా అధికము అవుతుంది. ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది. అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి. అందువలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు లేదా చాల జాగ్రత్త గా ఉండాలని చెబుతారు. అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజ్రుమ్భిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు "వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త" అని. నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు. 
       అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం. ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది. చంద్రుడు 24  గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు. ఈ కాలం ఒక తిథి తో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది. అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు. ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యం గా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది. అది మన శరీరం లో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మందకొడిగా ఉంటుంది. ఉదాహరణకు మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి. తత్ఫలితంగా జీర్ణ క్రియ మందగించి మలబద్ధానికి దారి తీస్తుంది. మల బద్ధం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము.  అందువలన ఈ రోజు (ఏకాదశి రోజు) ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది. దీని కోసం  ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి. ఈ విధం గా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడుతుంది.
      అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్ర రీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది. అయితే మనకి భక్తి అంటే గురి కుదురుతుంది, కాని అది విజ్ఞాన శాస్త్ర పరంగా చెబితే ఎంతమంది వింటారో అన్న సంశయంతో మన పెద్దలు భక్తి మార్గానికి ప్రచారం ఇచ్చారేమో. ఏది ఏమైనా ఏకాదశి నాడు (మాత్రమే) ఉపవాసం చేస్తే మనకు మంచిది.

ఏకాదశి వ్రతవిదనం వివిదరకముల సందేహములు సమాధానములు

ఏకాదశి వ్రతం అనగా

ఏకాదశి వ్రతం అనగానేమి? అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది?
సమాధానం:
ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు. వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి. వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి. ఏకాదశీ వ్రతాలు ౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి.
౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి.
౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి. ౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి.
ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి. ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది. పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల పేర్లు క్రమంగా –
చైత్రం -కామదా,
వైశాఖం – మోహనీ,
జ్యెష్థం – నిర్జలా,
ఆషాఢం – శయనీ,
శ్రావణం – పుత్రదా,
భాద్రపదం – పద్మా, ఆశ్వియుజం – పాపాంకుశా, కార్తికం- ప్రబోధినీ,
మార్గశ్శీర్షం- మోక్షదా,
పుష్యం – పుత్రదా,
మాఘం – జయా,
ఫాల్గుణం – ఆమలకీ – అని పేర్లు
అలాగే – ప్రతినెలలలో కృష్ణపక్ష ఏకదశులపేర్లు క్రమంగా –
చైత్రం -పాపమోచనీ,
వైశాఖం – వరూథినీ,
జ్యెష్థం – అపరా,
ఆషాఢం – యోగినీ,
శ్రావణం – కామికా,
భాద్రపదం -అజా, ఆశ్వియుజం – ఇందిరా, కార్తికం- రమా,
మార్గశ్శీర్షం- ఉత్పన్నా,
పుష్యం – సఫలా,
మాఘం – షట్ తిలా, ఫాల్గుణం – విజయా – అని పేర్లు
ఈ ఏకాదశీ వ్రతములను ముఖ్యంగా యతీంద్రులు, వానప్రస్థులు, గృహస్థులంద రూ ఆచరించవలెనని ధర్మ శాస్త్రములు బోధిస్తున్నవి. ఆషాఢశుక్ల ఏకాదశి నుంచి కార్తికశుక్ల ఏకాదశివరకూ యతీంద్రులు, ధర్మాచార పరాయణులైన గృహస్థులు చాతుర్మాస్య దీక్షను కూడా ఆచరిస్తారు.ఈ ఏకాదశీ వ్రతాలు ముఖ్యంగా ఉపవాస దీక్షాప్రధానాలు -అందుచేతనే –
ఉపోష్యైకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి|
కృత్వా దానం యథాశక్తి కుర్యాచ్చ హరిపూజనమ్||
అని గరుడపురాణం చెబుతు న్నది. కనుక ఉపవాసం, దానములు, హరిపూజ ఇవి ఏకాదశీ వ్రతంలో ముఖ్య విశేషాలుగా గ్రహించదగిన వన్నమాట.
అలాగే ఉపవాస విషయంలో –
ఏకాదశీ సదోపేష్యా పక్షయో: శుక్లకృష్ణయో:
అని సనత్కుమారసంహితా,
ఏకాదశ్యాముపవసేన్నకదాచిదతిక్రమేత్ –
అని కణ్వస్మృతి,
ఏకాదశ్యాం న భుంజీత కదాచిదపి మానవ: –
అని విష్ణుస్మృతి చెబుతున్నవి.
కనుక ఏకాదశీ వ్రతములలో ఉపవాసానికి అంత ప్రాధాన్య మున్నది. ఆశ్రమభేదంలేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలెనని విష్ణుస్మృతి చెబుతున్నది.
ఈ ఉపవాసదీక్షలో నిరాహారం గా జలం మాత్రమే తీసుకుని కొందరూ, నిర్జలంగా అంటే నీరుకూడా త్రాగకుండా కొందరూ పాటిస్తూంటారు. ఏకాదశీ తిథిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశితిథి ప్రవేశించగానే విష్ణుపూజనం చేసి విష్ణునైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి. అనివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమానమని శాస్త్రం చెబుతున్నది. ఇది సంగ్రహంగా ఏకాదశి వ్రత పరిచయం.
—————————————————————————
ఏకాదశి తిధి రెండు రోజులు ఉన్నప్పుడు ఉపవాసం ఏరోజున చెయ్యాలి ?? చాలా సందర్బాలలో ఏకాదశి తిధి ఒక రోజు సాయంత్రమో లేక మధ్యాహ్నమో వచ్చి తరువాతి రోజు మధ్యాహ్నం వరకు వుండే సమయాలలో ఉపవాసం ఏరోజు చెయ్యాలి మొదటి రోజా లేక రెండోరోజా?
సమాధానం: ధర్మనిర్ణయచంద్రికా –
అరుణోదయవేధోత్ర వేధః సూర్యోదయే తథా |
ఉక్తాద్వౌదశమీవేధౌ వైష్ణవఃస్మార్తయోః క్రమాత్ ||
వైష్ణవులకు అరుణోదయము నకు దశమీ వేధయున్ననూ స్మార్తులకు సూర్యోదయము నకు వోధయున్ననూ అట్టి ఏకాదశి ఉపవాసమునకు పనికిరాదు.
భృగుః – సంపూర్ణైకాదశీయత్రప్రభాతే పునరేవసా |
తత్రోపోష్యద్వితీయాత్ పరతో ద్వాదశీయది ||
ఒకరోజు ఏకాదశీ పూర్తిగా నుండి మరునాడు సూర్యోదయమునకు ఏకాదశీ మిగులుండి త్రయోదశినాడు ఉదయం ద్వాదశి మిగులున్న చో ఏకాదశీమిగులున్ననాడే ఉపవాసము చేయాలి
త్రయోదశ్యాం కియన్మాత్రా ద్వాదశీనలభేద్యది |
పూర్వాకార్యా గృహస్థైస్తు యతిభిః చోత్తరా యదా ||
మొదటిరోజు ఏకాదశి పూర్తిగా నుండి మరునాడుమిగులుండి త్రయోదశి నాడు ద్వాదిశి మిగులుకాకున్న, మొదటి రోజు గృహస్థులు, రెండవరోజు సన్యాసులు ఉపవాసము ఉండవలెను. మరింత వివరములకై “ధర్మసింధు”, “ధర్మనిర్ణయచంద్రిక” లను గ్రంథములను పరిశీలించగలరు.
ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి:

శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము
శాస్త్రము (పురాణము):
అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువులోని స్త్రీ తేజం ‘ముర’ అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది. ఆ స్త్రీ మూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు. మురని హరించడం వలన శ్రీ హరి ‘మురహర’ లేదా ‘మురహరి’ లేదా ‘మురారి’ అయినాడు.అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం. అయితే ఈ ఏకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్ర నామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.
Image result for ఏకాదశి నాడు
శాస్త్ర విజ్ఞానము:
అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు. ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది. అయితే చాల మంది గమనిం చే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది. ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు (ఉదా. రక్తము), మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమక్రమంగా అధికము అవుతుంది. ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది. అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి. అందు వలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు లేదా చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజృంభిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు “వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త” అని. నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు.
అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం? ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది. చంద్రుడు 24 గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు. ఈ కాలం ఒక తిథితో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది. అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు. ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యంగా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది. అది మన శరీరంలో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మంద కొడిగా ఉంటుంది. ఉదాహరణకు మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి. తత్ఫలితంగా జీర్ణక్రియ మంద గించి మలబద్ధానికి దారి తీస్తుంది. మలబద్ధకం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము. అందువలన ఈ రోజు (ఏకాదశి రోజు) ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది. దీని కోసం ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడు తుంది.
అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్రరీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది.
** సర్వం శ్రీకృష్ణార్పణమస్తు **
*************************************************************
ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసేప్పుడు తినకూడనివి:
ధాన్యం సంబంధించిన అనగా వరి, గోధుమ, జొన్న, రాగులు, సజ్జలు ఇత్యాది వాటితో చేసినవి
పప్పు దినులు అంటే కంది, పెసర, మినప, శనగ, పెసర్లు, బబ్బెర, పుట్నాలు, ఓట్స్ ఇత్యాదివి తీసుకోకూడదు
ఇక తీసుకునే పదార్థాలు:
పండ్లు , సగ్గుబియ్యం (పాయసంగా కాదు లేద కూరగాయలు వేసుకుని కిచిడీ కానీ చేసుకోవచ్చు , ఆవాలు వాడకూడదు) , Quinoa, buckwheat (ఈ రెండు reliance fresh లాంటి hyper market shopsలో దొరుకుతాయి) , పాలు, మజ్జిగ , పెరుగు
ఉప్పు మాత్రం సాధారణంగా వాడేది కాక సైంధవ లవణం లేదా rock salt (himalaya brand బాగుంటుంది) వాడాలి
ఏకాదశి ఉపవాసం ఆడవారికి ఎక్కువ వంట పని లేకుండా ఆ రోజు ఎక్కువ సమయం భగవద్ధ్యానం, నామ జపం మరియు పురాణ పారాయణం చేయడానికి అవకాశం కల్పించబడింది!! మామూలు రోజుల్లో ఆడవారికి వీలుపడదు కదా!! వంట పనే చాలా పెద్దపని వారికి !! ఇదండీ ఏకాదశి సంగతులు.
 Quinoa, buckwheat, millets ఇవి మామూలు రోజుల్లో కూడా తీసుకోవచ్చు!! చాలా చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు (healthy food)

వివిధ రకముల ఏకాదశి వివరములు మరియు ఏకాదశి వ్రతవిధానం

వివిధ రకముల ఏకాదశి వివరములు మరియు ఏకాదశి వ్రతవిధానం  :
Image may contain: 1 person
ఏకాదశి పండుగలు: 
ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు
1.శుక్ల పక్షము ,
2. కృష్ణ పక్షము ...
పక్షానికొక ఏకాదశి చొప్పున ..
ఇరవైనాలుగు ఏకాదశి లుంటాయి .
ప్రతి నెలా ఆమావాస్య కి ,
పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే
ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
*ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని
" బహుళ ఏకాదశి " అంటారు
సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
మాసము/పక్షము/తిథి----- పర్వదినం
చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి..
ప్రతి ఏకాదశి నిష్టగా శ్రీవారిని సేవించి తరించండి ..🙏🏻
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలోనున్నవి.
మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి
చైత్రము విష్ణువు కామదా వరూథినీ
వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా
జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ
ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా
శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా
భాద్రపదము-హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా
ఆశ్వయుజము-పద్మనాభుడు పాశాంకుశ రమా
కార్తీకము-దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి
మార్గశిరము-కేశవుడు ధృవ, మొక్షద సఫల
పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా
మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ
ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ
అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం:
చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి
చంద్రుడు ప్రభావం మన దేహం పై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. గడ్డి కూడా ఓషధమే, దాన్ని వినియోగించుకొనే క్రమం తెలిస్తే. ఈ భూమి మీద అంకురించిన వాటిలో ఓషధిగా పనిచేయనిదంటూ ఏమీ లేదు అని నిరూపిస్తాడు నాగార్జునుడు అనే వైధ్యశాస్త్రంలో నైపుణ్యం కల ఒక మహనీయుడు. వాటి వల్ల మన శరీరం పెరుగుతూ ఉంటుంది. శరీరానికి అవసరం అయిన ఆయా ఓషధులని ఇచ్చే భూమికి ఆయా ఓషధులని పండించే శక్తిని చంద్రుడు ఇస్తాడు. వాటి వల్ల పెరిగే మన శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో అంగంపై చంద్రుడు ప్రభావితం చేస్తాడు. అంటే మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి ఇలా కొన్ని ఉన్నాయి. చంద్రుడు ఒక్కోక్కరోజు తన కళలను పెంచుకుంటూ పోతాడు పూర్ణిమ దాకా. ఆపై ఒక్కోక్కరోజు తన కళలను తగ్గించుకుంటూ పోతాడు అమావస్య దాకా. ఇక్కడ మనం చెప్పుకునేది గ్రహాల కదలిక వల్ల ఏర్పడే చంద్రుడి కాంతి గురించి కాదు. మనకు కనిపించని విషయాలను శాస్త్రాలు చెబుతాయి. పూర్ణిమ వరకు పెరిగే చంద్రుడు మొదటి పది రోజులు అంటే దశమి దాకా ఒక్కోనాడు ఒక్కో జ్ఞానేంద్రియంపై ఆపై ఒక్కోనాడు ఒక్కో కర్మేంద్రియంపై ప్రభావం చూపిస్తాడు. ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సుపై పదకొండోరోజు ప్రభావం చూపిస్తాడు. పదకొండునే ఏకాదశం అని అంటారు. పన్నెండో నాడు ద్వాదశి, ఆనాడు మనస్సుకు వెనకాతల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు. ఆ బుద్ధికి వెనకాతల అహంత మరియూ మూల ప్రకృతి అని రెండు తత్వాలు ఉన్నాయి, వాటిపై తరువాతి రెండు రోజులు ప్రభావితం చేస్తాడు. ఆపై ఉన్న తత్వం జీవుడు. పూర్ణిమనాడు కానీ అమావాస్య నాడు కానీ జీవుడిపై ప్రభావితం చూపిస్తాడు.
కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది."ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనల్ని ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లాన్ని బుద్ధి అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృజించాడు. లోని ప్రపంచం వైపు దృష్టి ఉంచడం కష్టమే, అయితే ఆయా ఇంద్రియాన్ని ఎంత వరకు వాడు కోవాలో తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇంద్రియాల్ని నియంత్రించేవే వాటి పైన ఉండే మనస్సు మరియూ బుద్ధి. ఈ శరీరంతో జీవుడి యాత్ర సుఖంగా సాగాలి అంటే మనస్సుని నిగ్రహంగా, బుద్ధిని స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది. మనస్సు అనేది ప్రధానమైనది. మనకు మన పైన ఉండే ప్రవృత్తులకు మనస్సే మధ్య ఉండేది. మనస్సే కారణం మనం బాగుపడటానికి కానీ నాశనం అవడానికి కానీ. "మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః" అని మన ఇతిహాస పురాణలు చెప్పాయి. ఈ మనస్సును జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతావి జాగ్రత్తగానే జరుగుతాయి అని అంటారు. మనస్సుని వాడుకోవడం అనేది తెలియాలి. మనస్సుకి వెనకాతల ఉన్న బుద్ధికి భలం బాగుంటే మంచి నిర్ణయాలు జరుగుతాయి. బుద్ధి అంత బాగా లేకుంటే నిర్ణయాలు చెడిపోతాయి. అంటే ఈ రెంటిని ఎట్లా వాడుకోవాలో తెలుపడానికి పద్దతిని సూచించారు, అవే ఏకాదశి-ద్వాదశి.
మనస్సుకి భౌతికమైన చింతన తగ్గాలి, ప్రశాంతత కలగాలి. బుద్ధికి మాత్రం సాత్విక శక్తి పెరగాలి. పట్టుదల అనేది బుద్ధి లక్షణం కాబట్టి అది గట్టిగా ఉండాలి. మనస్సు అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందిన విషయాలవైపు ఎట్లా పడితే అట్లా వెళ్తుంది, దానికి బుద్ధి యొక్క ఆధారం అవసరం. మనస్సు అనేది నిర్ణయం తీసుకుంటే, బుద్ధి వెనకాతల భలపరుస్తుంది. తీసుకున్న నిర్ణయం సరియైనది కావాలంటే, మనస్సు యొక్క లక్షణమైన తమస్సుని తగ్గించాలి. మనం తీసుకొనే ఆహారం భూమినుండి వచ్చిందే. భూమికి తామస గుణం ఎక్కువపాల్లో ఉంటుంది. కనుక మన శరీరానికి ఇచ్చే ఆహారం తగ్గించాలి మనస్సు కోసం. నిర్ణయాన్ని భలపరిచే శక్తి బుద్ధిది కనుక దానికి సాత్విక శక్తి పెంచాలి. అది కూడా మనం తినే ఆహరం వల్ల పెంచాలి. ఏకాదశి నాడు ఆహారం తగ్గిస్తారు, ద్వాదశి నాడు తెల తెలవారే సమయాన్నే ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే మనస్సు మీద చంద్రుడు పనిచేసేది ఏకాదశి నాడు కనుక ఆహారాదులని ప్రక్కన బెడితే చంద్రుడు తన శక్తిని మనస్సుపై నేరుగా ప్రసరింపజేయగలడు. తమస్సు యొక్క ప్రభావం మనస్సుపై తగ్గుతుంది. వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రాలు మనస్సు అనేది సాత్వికాహంకారం నుండి వచ్చింది అని చెబుతాయి. అందుకనే ఏకాదశి నాడు చేయాల్సినవి ఆహారం తగ్గించడం, భగవన్నామాన్ని అనుసంధించుకోవడం మరియూ మిగతా ఇంద్రియాలని మేల్కొని ఉంచేట్టు చేయడం. ఇవి చేసి మనస్సుకు తామస గుణాన్ని తగ్గించడం అనేది నియమం. తరువాతి నాడు అంటే ద్వాదశినాడు, బుద్ధికోసం తెల తెల వారే సమయానికి అంటే సూర్య దర్శనం అవగానే ఆహారాన్ని అందించాలి. అది ప్రభావితం అవుతుంది. సత్వగుణం కలిగిన మనస్సుకి సత్వ గుణం కల బుద్ధి తోడైతే ఆలోచనలూ సరి అవుతాయి. నిర్ణయాలు సరి అవుతాయి, తద్వారా ఫలితాలు చెప్పనవసరం లేకుండానే మంచివవుతాయి. ఈ రెండు కలిపి ఒక్క వ్రతం అంటారు - ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణం. ఏకాదశి నాడు చేసే ఉపవాసాన్ని ద్వాదశినాడు సమాప్తం చేయడమే పారణం అని అంటారు. రెంటిని వేరు వేరుగా చేయడం కూడా ఫలితమే అని చెబుతారు. అయితే ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి, రెండు సార్లు చేయాలి అనేదే నియమం. సంస్కృతంలో ఒక విషయం చెప్పారు "ఏకాదస్యాం అహోరాత్రాం కర్తవ్యం భోజనత్రయం". మామూలు నాడు రెండు సార్లు భోజనం చేస్తాం, కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అంటే, మూడు సార్లు చేయాలని అర్థం అనుకునేరూ భో-జన-త్రయం అంటే మనుష్యులూ మీరు మూడు పనులు చేయాలి అని అర్థం. ఏమిటవి అంటే ఉపవాసం, హరి గుణ గానం మరియూ జాగరణం. ఈ మూడు కూడా ప్రేమతో చేయాలి. ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది, ప్రేమతో హరి గుణ గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసం అని అంటారు, నిరంతరం తలుస్తూ ఉంటే నిద్ర రాదు, దాన్నే జాగరణం అని అంటారు. ఇది ప్రతి ఏకాదశికి నియమమే.

Thursday 9 November 2017

సంతాన దోష నివారణ మంత్రం : గర్భ రాక్షంభిక అమ్మవారి స్త్రోత్రం

సంతానం కలుగుటకు  శ్రీ గర్భరక్షా స్తోత్రం:

గర్భదోషాలు పోగొట్టి సంతాన భాగ్యం కలుగచేసే కరువలార్చేరి శ్రీ కరువలార్ నాయకి అఖిలాండేశ్వరి అమ్మ ఆలయం-ఈ అమ్మ ప్రత్యేకత ఏమిటంటే సంతానాన్ని ప్రసాదించుట మాత్రమే కాదు ఎవరైనా గర్భం దాల్చినాక బిడ్డ ఎదుగుదల లేక గర్భస్రావం అవుతున్నవారు ఈ అమ్మను దర్శిస్తే బిడ్డ ఎదుగుదల అమ్మ కాపాడుతుంది. గర్భారక్షంబికా అమ్మవారితో పాటు పిల్లలు లేని వారు ఈ క్రింద స్త్రోతం పారాయణం చేయుటవలన సంతాన బాగ్యం కలుగును. 


ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః


ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
 
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
1వ నెలలో, మొదటి  శ్లోకము – రోజూ 108 సార్లు

2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు

3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు

4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు

5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు

6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు

7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు

8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు

9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు

Monday 4 September 2017

అనంత పద్మనాభ వ్రత విధానం

అనంత పద్మనాభ వ్రత విధానం :

పంచభూత అధిపతి ఐనా మహా గణపతి పూజ చేయాలి. తరువాత కలశ పూజచేసిన పిదప యమునా పూజ ప్రారంభించాలి.  





యమునా పూజ
ధ్యానం: 
శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.
యమునాదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:  
శ్లో:నమస్కరోమి యమునే సర్వపాపా ప్రణాశిని 
రత్నసింహాసనం దేవే స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.

పాద్యం: 
శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.
యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: నందిపాడే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిదముత్తమం.
యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే, 
గృహాణాచమనీయం దేవి శంకరార్ధ షరీరిణి .
యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.

స్నానం:
శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే
సర్వపాప ప్రశమని తున్గాభాద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:
శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,
సువ్రతం కురుమే దేవి తుంగభద్రే  నమోస్తుతే.
యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మధుపర్కం: 
శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే 
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.
యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.

ఆభరనాణి :
శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ షరీరిణి 
సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.

గంధం:
శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగేత్రిపద గామిని,
జటాజూట సమదూతే సర్వకామఫలప్రదే.
యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.

అక్షతలు:  
శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ నమలాన్ శుభాన్.
యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.

పుష్పై పూజ:
శ్లో: మందారై పారిజాతైస్చ పాటలాశోక చంపకై 
పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః  -  పాదౌ పూజయామి
ఓం సుజంఘాయ నమః -  జంఘే పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పుణ్యాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలాయై నమః - కటిం పూజయామి
ఓం గోదావర్యై నమః  - స్థనౌ పూజయామి
ఓం భవనాశిన్యై నమః - కంటం  పూజయామి 
ఓం తుంగ భద్రాయై నమః - ముఖం పూజయామి
ఓం సుందర్యై నమః - లలాటం పూజయామి
ఓం దేవ్యై నమః - నేత్రే పూజయామి 
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం భాగీరధ్యై నమః - శిరః పూజయామి 
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. 

ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం చందనాగరు సంయుతం 
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.
యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.

దీపం:
శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం 
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.
యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: భక్ష్యైస్చ భోజ్యైస్చ రాసి షడ్బిస్సమంవితం 
నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం: 
శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.

శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం 
ధ్యానం:
శ్లో: క్రుత్వాదర్భ మాయం దేవం పరిధాన సమన్వితం 
ఫనైసప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షినాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే
చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే
అవ్యయం సర్వలోకేశం పీతాంభరధరం  హరిం
అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం:
శ్లో: ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే
ఇమాంమయాక్రుతం పూజాం గృహాణ సురసత్తమ.
అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సర్పయామి.

ఆసనం:
శ్లో: అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః 
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి.

తోరస్తాపనం:
శ్లో: తస్యాగ్రతో దృడం సూత్రం కుంకుమాక్తం  సుదోరకం
చతుర్దశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే 
అనంతపద్మనాభాయ నమఃతోరస్తాపనం కరిష్యామి.

అర్ఘ్యం:
శ్లో: అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ చ 
అర్ఘ్యం దదామితెదేవ నాగాదిపతయే నమః 
అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సర్పయామి.

పాద్యం:
శ్లో: సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన
పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: దామోదర నమోస్తుతే నరకార్ణవతారక
గృహాణాచమనీయం  దేవ మయాదత్తం హి కేశవా.
అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:
శ్లో: అనంతానంత దేవేశ అనంత ఫలదాయక
దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే
అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతం:
శ్లో: అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ
పంచామ్రుతైస్చ విదివ త్స్నాపయామి దయానిధే.
అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:
శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
స్నానం ప్రకల్పయేతీర్ధం సర్వపాప ప్రముక్తయే
అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్ర యుగ్మం:
శ్లో: శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమఃవస్త్ర యుగమ సమర్పయామి.

యజ్ఞోపవీతం:
శ్లో: నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమఃయజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:
శ్లో: శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాధీ భిరన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి.

అక్షతాన్:
శ్లో: శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో 
అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పపూజ:
శ్లో: కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకై ర్వకులైశుభై 
శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ: 
ఓం అనంతాయ నమః   -  పాదౌ పూజయామి
ఓం శేషయ నమః  -  గుల్భౌ పూజయామి 
ఓంకాలాత్మనే నమః -  జంఘే పూజయామి
ఓం విశ్వరూపాయ నమః - జానునీ పూజయామి
ఓం  జగన్నాదాయ నమః -  గుహ్యం పూజయామి 
ఓం పద్మనాభాయ నమః -  నాభిం పూజయామి
ఓం సర్వాత్మనే నమః  -  కుక్షిం పూజయామి
ఓం శ్రీ వత్సవక్షసే నమః - వక్షస్థలం పూజయామి
ఓం చక్రహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం ఆజానుబాహవే నమః - బాహూన్ పూజయామి
ఓం శ్రీ కంటాయ నమః - కంటం పూజయామి
ఓం చంద్రముఖాయ నమః - ముఖం పూజయామి
ఓం వాచాస్పతయే నమః - వక్త్రం పూజయామి.
ఓం కేశవాయ నమః - నాసికాం పూజయామి
ఓం నారాయణాయ నమః - నేత్రే పూజయామి
ఓం గోవిందాయ నమః - శ్రోత్రే పూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః - శిరః పూజయామి
ఓం విష్ణవే నమః - సర్వాంగణ్యాని పూజయామి 

అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము 

ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమఃఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః

తోరగ్రదిం పూజ:
ఓం కృష్ణాయ నమః - ప్రధమ గ్రంధిం పూజయామి 
ఓం విష్ణవే నమః - ద్వితీయ గ్రంధిం పూజయామి 
ఓం జిష్ణవే నమః - తృతీయ గ్రంధిం పూజయామి 
ఓం కాలాయ నమః - చతుర్ధ గ్రంధిం పూజయామి 
ఓం బ్రహ్మనే    నమః - పంచమ గ్రంధిం పూజయామి 
ఓం భాస్కరాయ నమః - షష్టమ గ్రంధిం పూజయామి 
ఓం శేషయ నమః - సప్తమ గ్రంధిం పూజయామి 
ఓం సోమాయ నమః - అష్టమ గ్రంధిం పూజయామి 
ఓం ఈశ్వరాయ నమః - నవమ గ్రంధిం పూజయామి 
ఓం విశ్వాత్మనే నమః - దశమ గ్రంధిం పూజయామి 
ఓం మహాకాలాయ నమః - ఏకాదశ గ్రంధిం పూజయామి 
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః - ద్వాదశ గ్రంధిం పూజయామి 
ఓం అచ్యుతాయ  నమః - త్రయోదశ గ్రంధిం పూజయామి 
ఓం అనంతపద్మనాభాయ నమః - చతుర్దశ గ్రంధిం పూజయామి 

ధూపం:
శ్లో: వనస్పతి రసైర్దివ్యై ర్నానా గంధైశ్చ సంయుతం
ఆఘ్రేయ సర్వదేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం
ఓం అనంతపద్మనాభాయ నమః దూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామ్మయా 
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం 
ఓం అనంతపద్మనాభాయ నమః దీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచాలాంకురు
ఈప్సితం మే వరం దేవహి పరత్రచ పరాం గతిం
అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం
మయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన.
ఓం అనంతపద్మనాభాయ నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో:  ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం 
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం.
ఓం అనంతపద్మనాభాయ నమః  తాంబూలం సమర్పయామి.

నీరాజనం:
శ్లో: సమ సర్వహితార్దాయ జగదాధార మూర్తయే
సృష్టి స్తిత్యంత్యరూపాయ అనంతాయ నమోనమః 
ఓం అనంతపద్మనాభాయ నమః నీరాజనం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రనస్యంతి ప్రదక్షిణ పదేపదే 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం క్రుపయాదేవ శరణాగత వత్సల 
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ 
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన 
నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ.
ఓం అనంతపద్మనాభాయ నమః  ప్రదిక్షణ నమస్కారాన్ సమర్పయామి.

తోరగ్రహణం:
శ్లో: దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవ్రుద్దయే 
అనంతాఖ్య మేడం సూత్రం దారయామ్యః ముత్తమం
ఓం అనంతపద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి.

తోరనమస్కారం:
శ్లో: అనంత సంసార సముద్ర
మాగ్నం మమభ్యుద్దర వాసుదేవ
అనంతరూపిన్ వినియోజయస్వ
హ్యనంత సూత్రాయ నమోస్తుతే
ఓం అనంతపద్మనాభాయ నమః తోరనమస్కారాన్ సమర్పయామి.

తోరబంధనం:
సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తుం 
వాన్చంతి ఏ కురు కులోద్వః శుద్దసత్వా
సంపూజ్యచ త్రిభువనేశ మనంతరూపం 
బద్నంతి దక్షణ కారే వరదోరకం తే.
ఓం అనంతపద్మనాభాయ నమః  టోర బంధనం కరిష్యామి.

జీర్నతోరణం విసర్జనం:
శ్లో:  అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక 
సూత్రగ్రందిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః

ఉపాయనదానం :
శ్లో: అనంతః ప్రతిగ్రుహ్న్నతి అనంతోవై దదాతిచ 
అనంత స్తారకోభాభ్యా మనంతాయ నమోనమః 

వ్రతవిధానము :
ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .


    అనంతపద్మనాభ వ్రత కథ

    సూతపౌరాణికుడు  శౌనకాది మహర్షులను గాంచి యిట్లనియె!  ఓ మునిశ్రేష్టులారా! లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింప బడుచున్డిరి .  అట్టి దారిద్ర్యమును తోలగాచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు.  దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని  గాంచి  "ఓ మహాత్మా! నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచూ ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను.  ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి వుపాయమును చెప్పవలేయునని ప్రాధించిన శ్రీకృష్ణుడు యిట్లనియె.

                "ఓ ధర్మరాజ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు.  మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయవలెయును.  అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగును" అని వచించిన ధర్మరాజు యిట్లనియె.
               
                   "ఓ రుక్మిణీ ప్రానవల్లభా! ఆ అనంతుడను దైవంబు ఎవరు?  అతడి ఆదిశేషుడా! లేక తక్షుడా! లేక సృష్టికర్త యైన బ్రహ్మయా! లేక పరమాత్మ స్వరూపుడా" అని అడిగిన శ్రీ కృష్ణుడు యిట్లనియె.
                   "ఓ పాండుపుత్ర! అనంతుదనువాడను నేనేతప్ప మరిఎవరో కాదు.సూర్య గమనముచే కలాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము.  నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని.  నన్ను క్రుశ్నునిగాను,  విష్ణువు గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారనభూతునిగాను, అనంతపద్మనాభునిగాను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు.  ఈ నా హృదయమునందే పదునాలుగు ఇంద్రులును, అష్టావసువులును, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, సప్త ఋషులును, భూర్భు వస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని" అనిన ధర్మరాజు శ్రీ కృష్ణుని గాంచి " ఓ జగన్నాధ! నీవు వచించిన అనంత వ్రతమును యేతుల ఆచరిన్చావలేయును?  ఆ వ్రతము ఆచరించిన ఏమి పహలము గలుగును?  ఏయే దానములు చేయవలెయును?  ఈ దైవమును పూజింపవలెను? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము జెందిరి?  అని ధర్మరాజు అడుగగా!  శ్రీకృష్ణుడు యిట్లనియె.

                 "ఓ ధర్మరాజ! చెపాడ వినుము.  పూర్వము వశిష్ట గోత్రోద్భవుడు , వేద శాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాంహ్మణుడు కలదు. అతనకి భ్రుగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు.  ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంత కాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగునవతియగు ఒక కన్యను గనెను.  ఆ బాలికకు షీలా అను నామకరణము చేసిరి.  

              ఇట్లు వుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతి చెందెను.  పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను ఒక కన్యను వివాహము చేసుకొనెను.  ఆ కర్కశ ఎంతో కటిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారిణి గాను, ఉండెను.  ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచూ, గోడల యందును, గడపలయందును, చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయండు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టిచు దైవభక్తిగలదై యుండెను.  ఇట్లుండగా ఆశీలకు వివాహ వయసు వచ్చినది.  అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్నిదినములు తపస్సుచేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను.  అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తె యగు శీలను ఇచ్చి వివాహము చేసెను.  ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి "ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా! ఏమి ఇద్దాము అని అడుగగా,  ఆ కర్కశ చివుక్కున లేచి లూపలికి వెళ్ళి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను.  అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైన ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపుపిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను.  అంత కౌదిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండిఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను.  నాటిదినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు యెర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తిశ్రద్దలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌదిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, "ఓ వనితా మణులారా! మీరు ఎదేవుని పూజించుచున్నారు?  ఈ వ్రతము పేరేమి?  నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్ధించగా, ఆ పతివ్రతలు యిట్లనిరి.  "ఓ పుణ్యవతి చెప్పెదము వినుము.  ఇది అనంత పద్మనాభ వ్రతము.  ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును.  

                  భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.
              
                  శ్లో:  క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,
                        సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.

                   అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి అయిడుపల్ల గోధుమపిండితో  ఇరువది ఎనమిది అతిరసములన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును.  మరియు పూజాద్రవ్యములన్నియు పడులాలుగేసి వుండవలేయును.  పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నున్దవలేయును.  ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచున్దవలెను.  అని ఆ వనితామణులు చెప్పిరి.  అంట ఆ షీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిందిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాడులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.  

                 అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోష భరితులై  సుఖముగానున్దిరి.  శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.

               అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుంది యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి "ఓ కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు?  నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వష్యంబు చేసుకోనుతకా అని అడిగెను.  అప్పుడు షీలా ఇట్లనియె.

                "ఓ ప్రాణ నాయకా!  అనంతపద్మనాభస్వామి ని ధరించియున్నాను.  ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకీ ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని" తెలిపెను.  అప్పుడు కౌదిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుదనగా యే దేవుడు అని దూశించుచూ ఆ తోరమును త్రెంచి భాభా మండుచుండేది అగ్ని లో పదవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.  

                 పిదప కొన్ని రోజులకు కౌదిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల  పాలగును.    గృహము అగ్నిపాలయ్యేను.  మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను.  ఎవరితో మాట్లాడినాను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.  

                 అంతటా కౌదిన్యుడు ఏమియునుదోచక  దారిద్ర్యముచే పీడింప బడుచూ  అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల  భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియె: ఓ వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా?  యని అడుగగా ఆ వృక్షము నే నేరుగానని చెప్పెను.  

                  అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాద్దిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా!  అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.  

                    పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక వ్రుశాభామును చూచి ఓ వ్రుశాభారాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.  

                 పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూదియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూదియును, హన్సకారండవ చక్రకాడులతో గూదియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, ఓ కమలాకరంబులారా!  మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను.  అందులకు ఆ పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను.  వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను.  అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.  

                   అంతటా కౌదిన్యుడు ఎంతో విచారముతో  బాధతో మూర్చబోయి క్రిందపడెను.  అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్ణణ రూపదారుడై కౌదిన్యుని చెంతకు వచ్చి " ఓ విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోఎను.  అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని ఈ విధంబుగా ప్రార్ధించెను.  

                  నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా" యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై "ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని.  నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విశ్నులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని  అనెను.  
    అప్పుడు కొందిన్యుడు ఆనందముతో ఇట్లనెను.

                    ఓ జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి ?  ఆ ఆవు ఎక్కడిది?  ఆ వృషంభు ఎక్కడినుండి వచ్చెను?  ఆ కొలను విశేషము ఏమిటి?  ఆ గాడిద ఏనుగు, బ్రాహ్మనులు ఎవరు?  అని ఆ భగవంతుడిని అడిగెను.  అపుడు ఆ పరమాత్ముడు.
               
                    ఓ  బ్రాహ్ణణ శ్రేష్టుడా!  పూర్వము ఒక బ్రాహ్ణణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను.  ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్ణణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు.  పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై
    బ్రాహ్ణణులకు చవితి భూమిని దానము జేసినందున ఆ రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు.  ఆ కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము.  ఒక మానవుడు సర్వదా పరులను దూశించుచూ నున్దినందున గాదిదయై పుట్టి తిరుగుచున్నాడు.  పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను.  అనంత పద్మనాభుదనైన నేనే బ్రాహ్ణణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని.  కావున నీవు ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.

                  పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.  

                ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు.  మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను.  సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి.  కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.