Friday, 30 September 2016

విజయదశమి అనగా ఏమితి ?

విజయదశమి అనగా ఏమితి ?

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

మహర్నవమి అబ్నగా ఏమితి

మహర్నవమి అబ్నగా ఏమితి

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు

దుర్గాష్టమి అనగా ఏమిటి ?

దుర్గాష్టమి అనగా ఏమిటి ?
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.

దేవి నవరాత్రులలో పదొవ రోజు శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రి  లో పదొవ రోజు  పూజ విధి విధానం :

పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?

పేదవాళ్ళకి అన్నదానం చేయుటవలన భోగ బాగ్యలు ఫలించును
దరించ వలిసిన దుస్తుల రంగు : ఎర్రరంగు
పాటించవలిసిన మంత్రం : రాజరాజేశ్వర్యష్టకం.
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.
లలితా సహస్రనామము పారాయణము చేయవలెను.
కుంకుమార్చన చేయవలెను.
సువాసినీ పూజ చేయవలెను.
శ్రీచక్రార్చన ఉత్తమమైనది.
లడ్డూలు నివేదన చెయ్యాలి.
శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్
అమ్బా శామ్భవి చన్ద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా మోహిని దేవతా త్రిభువనీ ఆనన్దదాయినీ
వాణీ పల్లవపాణివేణుమురళీగానప్రియా లోలినీ
కల్యాణీ ఉడురాజబిమ్బ వదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా నూపురరత్నకఙ్కణధరీ కేయూరహారావళీ
జాతీచమృకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణు వినోదమణ్డితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాన్తకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముణ్డా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా శూలధనుః కశాఙ్కశధరీ అర్థేన్దుబిమ్బాధరీ
వారాహీమధుకైటభప్రశమనీ వాణీ రమా సేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మహేశ్వరీ చామ్బికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీ కృతా
ఓఙ్కారీ వినతాసుతార్చితపదా ఉద్దణ్డ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాన్తజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా పాలితభక్తరాజదనిశం అమ్బాష్టకం యః పఠేత్
అమ్బాలోలకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అమ్బా పావనమన్త్రరాజపఠనాదన్తే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
~ ఇతి శ్రీరాజరాజేశ్వర్యష్టకం సమ్పూర్ణమ్ ~

దేవి నవరాత్రులలో తొమ్మిదొవ రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో   తొమ్మిదొవ రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?
Image result for దసరా 9 th day
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
చండీ సప్తశతీ హోమము చేయవలెను.
నివేదన: చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నివేదన చేయవలెను.
మహిషాసురమర్దిని స్తోత్రం
అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే ||1||
సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 2 ||
అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 3 ||
అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా m.ర్గదిపతే |
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 4 ||
అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే
కాతురా వికార దురిన మహాశివ దుతక్రత ప్రమతదిపతే |
దురిత దురిహ దురషయ దుర్మతి దానవదుట క్ర్తన్తమతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 5 ||
అయి శరణాగత వైరి వదువర విరా వరభాయ దయకరే
త్రిభువన మస్తక శుల విరోధి శిరోది క్ర్తమల శులకరే |
దుమిడుమి తామర దున్డుభినాడ మహో ముఖరిక్ర్త తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 6 ||
అయి నిజ హుంక్ర్తి మాత్ర నిరక్ర్త దుమ్ర విలోకాన దుమ్ర శాటే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లేట్ |
శివ శివ శుంభ నిషుంభ మహాహవ తర్పిత భూత పిశాకారాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 7 ||
ధనురను సంగ రానక్షనసంగా పరిస్ఫుర దంగా న తత్కతకే
కనక పిశంగా ప్ర్శత్క నిశంగా రసద్భాట శ్రంగా హతవ ఉకే |
కర్త కాతురంగా బలక్షితి రంగ ఘటద్బహురంగా ర తడ్బతుకే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 8 ||
జాయ జాయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుటే
భాన భాన భిన్జిమి భిన్క్ర్త నుపుర సింజిత మోహిత భుతపతే |
నటిత నటర్ధ నటి నట నాయకా నటిత నాట్య సుగానరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 9 ||
అయి సుమన్ సుమన్ సుమన్ సుమన్ సుమనోహర కంటియుటే
శ్రిత రజని రజని రజని రజని రాజనికర వక్త్రవ్ర్తే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరదిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 10 ||
సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రాల్లక మల్లరాటే
విరచిత వల్లిక పల్లిక మల్లికా భిల్లిక భిల్లిక వర్గ వ్ర్తే |
సితక్ర్త పుల్లిసముల్ల సితరున తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 11 ||
అవిరాల గండ గలన్మడ మేదుర మత్త మతన్గజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూపా పయోనిది రాజసుటే |
అయి సుద తిజన లలసమనస మోహన మన్మథ రాజసుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 12 ||
కమల దళామల కోమల కాంతి కలాకలితమాల బాలలతే
సకల విలాస కలనిలయక్రమ కేలి కాలత్కల హంస కులే |
అలికుల సంకుల కువాలయ మండల ములిమిలద్భాకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 13 ||
కర మురళి రవ విజిత కుజిత లజ్జిత కోకిల మంజుమతే
మిలిత పులిండ మనోహర గుంజిత రంజితశైల నీకు న్జగాటే |
నిజగున భూత మహాశాబరిగన సద్గుణ సంభ్ర్త కేలితలే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 14 ||
కటిత త పిత దుకుల విచిత్ర మయుఖతిరస్క్ర్త కేంద్ర రుస్
ప్రణత సురాసుర ములిమనిస్ఫుర డంషుల సంనఖ కేంద్ర రుస్ |
జిత కనకకాల ములిపదోర్జిత నిర్భర కుంజర కుమ్భాకుస్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 15 ||
విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుటే
కర్త సురతరక సంగారతరక సంగారతరక సునుసుటే |
సురత సమాధి సమనసమది సమదిసమది సుజతరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 16 ||
పడకమలం కరుననిలయే వరివస్యతి యోఅనుదినన్ స శివే
అయి కమలె కమలనిలయే కమలనిలయ్ స కథం న భావేట్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశిలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 17 ||
కనకలసత్కల సిందు జలిరను సింసినుటే గుణ రంగాభువం
భాజాతి స కిం న శాసికుకా కుంభ తాటి పరిరంభ సుఖనుభావం |
తవ కారణం శరణం కరవని నతమరవని నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 18 ||
తవ విమలేన్డుకులం వదనేన్డుమలం శకలం నను కులయతే
కిము పురుహుట పురిండుముఖి సుముఖిభిరసు విముఖిక్రియతే |
మమ తు మతం శివనమదనే భవతి క్ర్పాయ కిముట క్రియేట్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 19 ||
అయి మయి దినదయలుతయ క్ర్పయైవ త్వయా భావితవ్యముమే
అయి జగతో జనని క్ర్పయాసి యథాసి తతానుమితసిరాటే |
యడుసితమత్ర భావత్యురారి కురుతడురుతపమపకురుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 20 ||
~ ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం సంపూర్ణం ~
నవమినాడు శ్రీ జగదంబకు పేలాలు నివేదించి దానము చేసిన వానికి పై లోకములలో సౌఖ్యములు గల్గును.
దరించ వలిసిన దుస్తుల రంగు :కృష్ణ నీలం రంగు

దేవి నవరాత్రులలో ఎనిమిదొవ రోజు శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?


దేవి నవరాత్రులలో ఎనిమిదొవ రోజు  శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) దేవిని ఎలా పుజించుకోవాలి ?

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి.
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.
దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చెయ్యాలి.
అష్టమినాడు కొబ్బరికాయ నివేదన చేసి దానము చేసినవాడికి తాపత్రయములుండవు.
దరించ వలిసిన దుస్తుల రంగు :నేరేడు పండు రంగు

దేవి నవరాత్రులలో ఏడొవ రోజు శ్రీ సరస్వతీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో ఏడొవ రోజు  శ్రీ సరస్వతీ దేవిని ఎలా పుజించుకోవాలి ?
Image result for నవరాత్రులు 7 th డే
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది
సప్తమినాడు శ్రీదేవికి గుడ నైవేద్యము చేసి దానము చేసినవాడు శోక రహితుడగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :ఆకు పచ్చ రంగు

దేవి నవరాత్రులలో ఐదవ మరియు ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో  ఐదవ మరియు ఆరొవ రోజు:
5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
దేవి నవరాత్రులలో ఐదవ   రూపం లలిత పరమేశ్వరి  - స్కంధమాత.


అమ్మవారిని లలితా ప్రతిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో రెండవశక్తి ఈమె. త్రిమూర్తుల కంటె ముందునుంచి ఉన్న శక్తి కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబ డుతోంది. ఈ తల్లి శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవత గా, తనను కొలిచే భక్తులను అనుగ్రహి స్తోంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూ డా ఈ లలితాత్రిపుర సుందరీదేవే. ఘోర మైన దారిద్య్ర బాధల నుంచి విముక్తి కలిగించి, మనకు మహదైశ్యర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి.
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో లలితాదేవి ఆలంకారాన్ని, లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.

ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం 
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ: 

నవరాత్రులలో  రూపం  - స్కంధమాత.


దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥
దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.
ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.
నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.
స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.
కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.

అరవరోజు 26-10-2017 : 

శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

చదవలిసిన స్త్రోత్రం : సర్వ దేవత కృత శ్రీ లక్ష్మి స్త్రోత్రం
క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీ
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే
వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మలోకగా
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ
రాజ్యలక్ష్మీః రాజ గేహే గౄహలక్ష్మీర్గౄహే గౄహే
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః
ఇతి లక్ష్మీస్త్వం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైస్వరం లభేద్ధృవమ్
అభార్యో లభతేభార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియావాదినీమ్
పుత్రపౌత్రవత్రీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినమ్
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్
హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధృవమ్
సర్వ మంగళదం స్తొత్రం శోకసంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్
షష్టినాడు కమ్మని జుంటి తేనే సమర్పించి దానము చేసినవాడు మదన సుందరుడగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :గచ్చకాయ రంగు

దేవి నవరాత్రులలో నాల్గొవ రోజు శ్రీ అన్నపూర్ణా అమ్మవారిని ఎలా పూజించాలి

 దేవి నవరాత్రులలో నాల్గొవ రోజు శ్రీ అన్నపూర్ణా  అమ్మవారిని ఎలా పూజించాలి

శ్రీ అన్నపూర్ణా దేవి
దసరా ఉత్సవాలలో మూడోరోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.
పూజా విధానము
పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి
పారాయణ: అన్నపూర్ణ అష్టోత్తరము, స్తోత్రములు
అన్నపూర్ణాష్టకమ్
నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
[నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ]
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచర కరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశ మనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గాద్వార కవాట పాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
ఉర్వీ సర్వజయేశ్వరీ జయాకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
దేవి సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
చంద్రా ర్కానల కోటి కోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రా ర్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశాసాంకుశధరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
క్షత్ర త్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షా క్రందకరీ నిరామయకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి
మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్.
~ సంపూర్ణం ~
చవతినాడు అపూపములు దానము చేసిన వాడికి విఘ్నములు తోలుగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :ఆకాశ నీలం రంగు

దేవి నవరాత్రులలో మూడోవ రోజు శ్రీ గాయత్రీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో మూడోవ రోజు శ్రీ  గాయత్రీ  దేవిని ఎలా పుజించుకోవాలి ?
Image may contain: 1 person, smiling, standing and text
శ్రీ గాయత్రీ దేవి :

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి.
పటించవలిసిన మంత్రం :ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
తదియ నాడు పాలు నైవేద్యము పెట్టి , దానము చేసినవాడు సర్వ దుఖములనుండి విముక్తుడగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :పసుపు పచ్చ రంగు

దేవి నవరాత్రులలో రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో రెండవ రోజు  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని ఎలా పుజించుకోవాలి ?
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్
శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి.
ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.
త్రిశతీ పారాయణ చేసి అమ్మవారికి పాయసము నివేదన చెయ్యలి.
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము విషయ సూచిక నందు లభించును.
శ్రీ త్రిపురసుందరీ స్తోత్రము విషయ సూచిక నందు లభించును.
బాలా స్తుతి
ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపీ స్ఫటికమణిమయీ మాతంగీ షడంగీ
ఙ్ఞానీ ఙ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే
బాలా మన్త్రే కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యఙ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే
మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హరాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే
ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే
శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం
కదంబవన చారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబనీసేవితాం
నవాంబురుహలోచనాం అభినంబుదశ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణిం ముఖసముల్లసద్వాసినీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం శిలయా
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికకన్యకాం మధురభాషిణీమాశ్రయే
స్మరేత్ర్పథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలాం
ఘన స్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షేణాం శరచాప పాశాంకుశాం
ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరాం
జపాకుసుమభసురాం జపవిదౌస్మరేదంబికం
పురందరపురంధ్రికాచికురబంధ సైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతాం
ముకుంద రమణీమణీల సదలంక్రీయాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం
ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం
విదియనాడు పంచదారతో దేవిని పూజించి విప్రునకు పంచదార దాన మిచ్చినవాడు పెక్కు ఏండ్లు బ్రతుకును.
దరించ వలిసిన దుస్తుల రంగు :నారింజ రంగు

దేవీనవరాత్రులు సమయం లో ఏ ఏ రంగుల దుస్తులు ధరించాలి :

దేవీనవరాత్రులు సమయం లో ఏ ఏ రంగుల దుస్తులు ధరించాలి :

Image result for colourful devotional dress
పాడ్యమి -చిలక పచ్చ రంగు 
విదియ -నారింజ రంగు
తదియ -పసుపు పచ్చ రంగు
చవితి -ఆకాశ నీలం రంగు
పంచమి -గులాబీ రంగు
షష్టి -గచ్చకాయ రంగు
సప్తమి -ఆకు పచ్చ రంగు
అష్టమి -నేరేడు పండు రంగు
నవమి -కృష్ణ నీలం రంగు
దశమి -ఎర్రరంగు
వీ లయితే ఆచరించండి...
మరిన్న వివరాలకి మా వెబ్ పేజి.

దేవి నవరాత్రులలో మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ? శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో    మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ? శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
పాడ్యమి నాడు శ్రీదేవికి నేయి నైవేద్యమొసగి బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు ఆరోగ్యవంతుడగును
దరించ వలిసిన దుస్తుల రంగు :చిలక పచ్చ రంగు