ముక్కనుమ సావిత్రి గౌరీదేవి వ్రతం:
ఆలస్య వివాహ సమస్యలు & స్త్రీలకు సౌభాగ్య యోగ్యత కొరకు సావిత్ర గౌరీ దేవి వ్రత విశిష్టత :
కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా
పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ
నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ
భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని
ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి
వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి.
స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. దేవిని
తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి
బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం
చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన
కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి
పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి
పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు,
తాంబూలం వాయనంగా ఇస్తారు.
ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము
చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ
సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ
బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ
వుంటుంది.
No comments:
Post a Comment